కోలీవుడ్ లో కొట్టేసాడు.. ఇక మిగిలింది టాలీవుడే?

praveen
గత కొంతకాలం నుంచి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయిన సినిమాలు ఏవి అంటే అందరూ చెప్పేది బాలయ్య వీర సింహారెడ్డి తో పాటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలే అని. కానీ ఈ రెండు టాలీవుడ్ హీరోల సినిమాలతో పాటు అటు తమిళ డబ్ మూవీ కూడా ఒకటి తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  అదేదో కాదు తమిళ ప్రేక్షకుల ఇళయ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా. దిల్ రాజు దగ్గరికి మంచి కథ రావడం ఇక అప్పుడు టాలీవుడ్ లో హీరోలు అందరూ బిజీగా ఉండడం.. దీంతో విజయ్ కి కథ చెబితే అతనికి నచ్చేసి ఓకే చెప్పేయడం.. ఇక ఈ సినిమా పట్టాలెక్కడం జరిగింది.

 ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. అయితే ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన తర్వాత కొన్ని సందేహాలు వ్యక్తం అయ్యాయి. చాలా తెలుగు సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో వచ్చాయి. టైలర్ కూడా ఏదో తేడా కొడుతుంది అంటూ అటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఇక ఇటీవల ఈ సినిమా విడుదలైంది అని చెప్పాలి. అయితే తెలుగులో కాదు తమిళం సహ ఇతర భాషల్లో విడుదలైంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 ఇటీవల విడుదలైన ట్రైలర్ లో కథ కాస్త బోరింగ్ గా ఉన్నప్పటికీ ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా కథ కథనాన్ని ఎంతో ఎంగేజింగ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. విజయ్ అభిమానులకు కావలసినట్టుగానే ఎలివేషన్లు హీరోయిజం, ఫైట్లు ఉండడంతో తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారట. ఇలా ఒక రకంగా కోలీవుడ్లో హిట్టు కొట్టేసింది. కానీ ఇక ఇప్పుడు అసలు పరీక్ష తెలుగులో మొదలుకానుంది. తెలుగులో విడుదలయ్యాక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సినిమాలతో పోటీ ఉన్న నేపథ్యంలో వారసుడు ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: