ఏంటి.. హైపర్ ఆదికి సద్దాంతో గొడవలున్నాయా?

praveen
ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి స్పెషల్ డే రోజు ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ పంచడానికి ఆసక్తి కనబరుస్తున్నారు బులితెర కార్యక్రమాల నిర్వాహకులు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ కోసం ఇక ప్రతి ఛానల్ లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రసారం  అయ్యేందుకు అంత సిద్ధమైంది. అయితే ఇక ఎప్పుడూ కొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించే ఈటీవీ వారు ఇక ఇప్పుడు క్యాష్ వేర్ ఇస్ ద పార్టీ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలవుతున్న ప్రోమోలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ప్రోమోలలో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా చూపించడం.. ఇక ప్రేక్షకులలో కార్యక్రమం పై ఆసక్తిని పెంచడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగానే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తమదైన స్కీట్లతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రోమో చివర్లో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 ఇటీవల స్టార్ మా నుంచి ఈటీవీ కి వచ్చిన సద్దాం హుస్సేన్ ను తన దగ్గరికి పిలిచినా హైపర్ ఆది.. ఈ ఏడది మా ఇద్దరికీ మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అవి కొత్త సంవత్సరం లో కంప్లీట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఒక కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకున్నారు అని చెప్పాలి. దీంతో హైపర్ ఆది ఇలా అనడంతో వీరిద్దరి మధ్య అసలు వివాదం ఎక్కడ మొదలైంది.. ఎందుకొచ్చింది అన్న విషయం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: