కోలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రష్మిక.. ఏమైందంటే..?

Divya
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటిసారి తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ఈమెకు బాగా విజయాన్ని అందించాయి. ఇదిలా ఉండగా ఇటీవల పుష్ప పాన్ ఇండియా సినిమాలో డీ గ్లామరస్ పాత్రలో పోషించి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.
అప్పుడప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్న రష్మిక ఈ మధ్యకాలంలో మరింతగా కన్నడిగుల ఆగ్రహానికి గురి అవుతుంది. కారణం ఏమిటంటే కన్నడ భాష నుంచి వచ్చిందైనప్పటికీ తనకు కన్నడ మాతృభాష సరిగా మాట్లాడటం రాదని తెలిపి వారి ఆగ్రహానికి గురైన ఈమె ఇటీవల ప్రపంచం మెచ్చిన రిషబ్ శెట్టి కాంతారా సినిమాను ఇంకా చూడలేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఈమెను బ్యాన్ చేయాలి అంటూ కూడా వార్తలు వైరల్ చేశారు. తరువాత ఆమె మళ్ళీ సుదీర్ఘ లాంగ్ నోటు రాసి క్షమాపణలు తెలిపింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  మరొకవైపు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక కోలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది . ఎందుకంటే అక్కడ ఈమె డిమాండ్ చేసినంత పారితోషకం ఇవ్వడంతో పాటు ఈమె నటించే ప్రతి సినిమా కూడా విజయం అవుతుందనే నమ్మకంతో వరుసగా కోలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. రష్మిక ప్రస్తుతం శివ కార్తికేయ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. మరి ఈ సినిమాలతో ఆమె సక్సెస్ అవుతుందో లేదో తెలియాలి అంటే ఈ సినిమాలు విడుదల అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: