వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన శాకిని డాకినీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులు అయినటువంటి రెజీనా కేసాండ్రా , నివేత థామస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ఇద్దరు కూడా ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తమ నటన తో ... అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. 

అలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా షాకిని డాకిని అనే మూవీ లో కలిసి నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించలేదు. ఆ తర్వాత ఈ మూవీ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చింది. "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అల్లరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ వారు దక్కించు కున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: