ఆ సినిమాలో మహేష్ కి తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన అందం తనదైన టాలెంట్ తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మార్కెట్ ఫాలోయింగ్ ను భారీ స్థాయిలో పెంచుకున్న మహేష్ బాబు వరుస  సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు వరుస  హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి మహేష్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

 ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫుల్ లెన్త్ కమర్షియల్ గా  ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా కొద్ది రోజులు క్రితమే మొదలైంది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయగా ఈ పార్ట్ మొత్తం సూపర్ గా వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను జనవరి మొదటి వారం నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారట. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో  రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దానికి అనుగుణంగా వైవిధ్యమైన కథతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తీస్తున్నారట. అయితే ఇందులో భాగంగానే చాలామంది వేరే ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఈ సినిమాకి గాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాణి ముఖర్జీని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో హుందాగా ఉండే ఈ పాత్రను ఆమె అయితేనే బాగా చేస్తుంది అని త్రివిక్రమ్ ఆమెను ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: