త్రివిక్రమ్ సినిమా కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న మహేష్..!?

Anilkumar
ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ ప్రాజెక్టుగా చలామణి అవుతున్న కాంబినేషన్స్ లలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ ఖలేజా సినిమా పెద్ద డిజాస్టర్ ను అందుకుంది. అయినా కూడా ఈ రెండు సినిమాలు టీవీ టెలికాస్ట్ లో పెద్ద హిట్ లుగా నిలిచాయి. అయితే మహేష్ బాబు కి కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో అలవాటు పడింది ఖలేజా సినిమాతోనే. అందుకే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మరియు మహేష్ అభిమానుల్లో అంతటి క్రేజ్ ఉంది. 

త్రివిక్రమ్ ప్రస్తుతం అలా వైకుంఠపురంలో వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా కి కూడా స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించి మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు త్రివిక్రమ్.అంతే కాదు మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమా తరువాత మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరకు వరుస హిట్టులతో దూసుకుపోయాడు. ఇక అందుకే ఈ కాంబినేషన్ పై వారి అభిమానుల్లో అంతటి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ కాంబినేషన్ కొన్ని కారణాలవల్ల ఇప్పుడు ఆగిపోయింది.

స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసి యాక్షన్ మూవీని కాస్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చాలని అనుకుంటున్నారట.ఇక  షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆయన అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సంక్రాంతి తర్వాత నుండి మార్చి చివరి వారం వరకు ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తారని సుమారుగా 80 రోజుల కాల్ షీట్స్ ఈ సినిమా కోసం మహేష్ నాన్ స్టాప్ గా కేటాయించనున్నాడని ఈ సినిమా 80 రోజుల లాంగ్ షెడ్యూల్ 60% షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే మరియు శ్రీని లీల ఫైనల్ అయ్యారు అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికి రెడీ అవుతాడు అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: