బుచ్చిబాబుకు మళ్ళీ ఎదురీత !

Seetha Sailaja
‘ఉప్పెన’ లాంటి భారీ బ్లాక్ బష్టర్ తీసిన బుచ్చిబాబు స్థానంలో మరొక దర్శకుడు ఉండి ఉంటే ఈపాటికి కనీసం మరొక మూడు సినిమాలు తీసి ఉండేవాడు. ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని వదులుకుని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడమే లక్ష్యంగా రెండు సంవత్సరాలు వేచి చూసిన తరువాత మొదట్లో బుచ్చిబాబు కథకు ఓకె చేసిన జూనియర్ ఆలోచనలు మారడంతో అతడి స్థానంలో చరణ్ వచ్చి చేరిన విషయం తెలిసిందే.

బుచ్చిబాబు రామ్ చరణ్ ల మూవీ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఇక బుచ్చిబాబు కష్టాలు తీరినట్లే అని అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు ఈమూవీ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ ఆలోచనలు మారిపోయాయ అన్న సందేహాలు ఇండస్ట్రీలో కొందరికి కలుగుతున్నట్లు టాక్.

ఇలాంటి గాసిప్పులు రావడం వెనుక మరొక కారణం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రామ్ చరణ్ కన్నడ దర్శకుడు నర్తన్ తో కలిపి ఒక మూవీని చేసే విషయంలో కథ విషయమై చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే బుచ్చిబాబు చరణ్ ల మూవీ మరొకసారి వెనక్కు వెళుతుందా అన్నసందేహాలు కూడ కొందరికి కలుగుతున్నాయి. అయితే ఈవిషయం గురించి చరణ్ సన్నిహిత వర్గాలు మరొక విధంగా స్పందిస్తున్నట్లు టాక్.

కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా దర్శకుడు నర్తన్ చరణ్ ను కలిసి ఒక కథను చెప్పడం జరిగిందని అయితే ఆకథ విషయమే చరణ్ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని అంటున్నారు. అంతేకాదు బుచ్చిబాబు మూవీ ప్రాజెక్ట్ విషయంలో రామ్ చరణ్ కు మరొక ఆలోచనలేదని ఈమూవీ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం పట్టాలు ఎక్కడం ఖాయం అంటూ మరికొందరు లీకులు ఇస్తున్న నేపధ్యంలో బుచ్చిబాబుకు కొండంత ధైర్యం వస్తున్దనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: