వాల్తేరు వీరయ్య: ఆకట్టుకుంటున్న రెండో సాంగ్?

Purushottham Vinay
చిరంజీవి, రవి తేజ హీరోలుగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ పాట 'బాస్ పార్టీ సాంగ్ విడుదల అయ్యి దుమ్ము దులిపింది. ఇక తాజాగా రెండో పాట వచ్చేసింది. 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా' అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ట్యూన్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే 'బాస్ పార్టీ' సాంగ్ విడుదలై మంచి చార్ట్ బస్టర్ అయింది.మొదట ఈ పాటపై కొంత నెగిటివిటీ వచ్చినా కానీ ఇప్పుడు రిపీట్స్‌లో కూడా బాగానే వింటున్నారు.ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పాటను జస్ప్రీత్ జాజ్ ఇంకా సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాస్ పార్టీ లానే దీనికి కూడా లిరిక్స్‌ను దేవిశ్రీ ప్రసాద్‌నే అందించారు. సంక్రాంతి పండగ సందర్భంగా డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.ఇంకా ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ ఇంకా అలాగే రవితేజ సరసన కేథరిన్ థ్రెస్సా జంటగా నటించారు.ఈ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో షూట్ చేశారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.


ఇక ఈ లోయలో లొకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడి లోయ అందాలు చూసి తాను కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యానని ఆయన అన్నారు.ఇక ఆ ఆనందాన్ని ఆపుకోలేక తానే స్వయంగా అక్కడి లొకేషన్స్ లో కొన్ని వీడియోలను కూడా షూట్ చేసి షేర్ చేస్తున్నానని ఆయన తెలిపారు. లొకేషన్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నా కూడా ఇక అంతకుమించి చలి కూడా ఉందని అన్నారు. ఇక ఆ సాంగ్ ను షూట్ చేసే సమయంలో మైనస్ 8 డిగ్రీల చలిలో డాన్స్ చేశామని చెప్పారు.ఈ సినిమా షూటింగ్ లో స్టెప్స్ చేయడం చాలా కష్టమైందని అయినా ఫ్యాన్స్ ఆనందం కోసం గడ్డకట్టే చలిని కూడా తట్టుకొని డాన్స్ చేశానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పాట కోసం టీమ్ లో ప్రతీ ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారని, అలాగే తమ కష్టానికి తగ్గట్టుగానే పాట చాలా బాగా వచ్చిందన్నారు. ఈ సినిమాలో ఈ పాట ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని కూడా అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: