సుగుణా సుందరీ: అభిమానులు రెచ్చిపోవడం ఖాయం?

Purushottham Vinay
సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ  ఇంకా యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..'వీర సింహా రెడ్డి'.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా లాల్, 'దునియా' విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంకా అలాగే హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల 'జై బాలయ్య' అనే మాస్ ఆంథెమ్ ని రిలీజ్ చేయగా.. ఇంకా అది ట్రెండిగ్ అవుతూనే ఉంది.. గతకొద్ది రోజులుగా ఎక్కడవిన్నా కూడా ఇదేే పాట వినిపిస్తుంది. ఇక రీసెంట్‌గా 'సుగుణా సుందరీ'.. సుగుణా సుందరీ.. సుర సుర సూపులా రాకుమారీ' అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్‌ ని కూడా వదిలారు..ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అలరించే లిరిక్స్ రాయగా.. రామ్ మిర్యాల, సిగ్న్ద శర్మ చాలా చక్కగా పాడారు.. శేఖర్ మాస్టర్ సింపుల్, కూల్ స్టెప్పులతో కొరియోగ్రఫీతో ఇరగదీశారు..ఇక బాలయ్య అయితే ఈమధ్య బాలయ్య బెస్ట్ లుక్ ఇదే అనేంత స్టైలిష్‌గా కనిపించాడు..


శృతి హాసన్ తో బాలయ్య పెయిర్ చాలా బాగుంది.. ఇక ఇద్దరూ కలిసి ఫ్యాన్స్ విజిల్స్ వేసే సాలిడ్ స్టెప్పులేశారు.. బాలయ్య 62 వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేయడం చాలా ఆశ్చర్యమే.. ఇక మంచి ఊపుతో సాగిన ఈ లిరికల్ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది..ఇక ఖచ్చితంగా కూడా థియేటర్లలో ఫ్యాన్స్ డ్యాన్స్ చేసే సాంగ్ ఇచ్చాడు థమన్ అంటూ నెట్టింట ఈ పాటను తెగ వైరల్ చేసేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ .. ప్రస్తుతం ఇంకా ఒక సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది.. బాలయ్య ద్విపాత్రాభినయం సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది.. జనవరి 12 వ తేదీన నటసింహ బాల కృష్ణ 'వీర సింహా రెడ్డి' గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు..ఇక ఎప్పటిలానే 2023 సంక్రాంతి సీజన్ కూడా బాలయ్యకి బాగా కలిసొస్తుందని.. 'అఖండ' సినిమా తర్వాత మళ్లీ బాక్సాఫీస్ మాస్ జాతర చూడబోతున్నామని సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు పోస్టులతో సందడి చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: