ఆ విషయం లో విజయ్ దేవరకొండని మరికొన్ని రోజులు ఆగమంటున్న సమంత..!?

Anilkumar
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకోవాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమంత ఇప్పుడు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సమంత మయూసైటిస్ అనే  వ్యాధితో బాధ పడుతున్నప్పటికీ కొరియాకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది. ఇక అక్కడి నుండి వచ్చిన అనంతరం షూటింగ్ కి  జాయిన్ అవ్వబోతుంది అని వార్తలు వచ్చాయి. 

కానీ ఇప్పుడు విశ్వసినీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత హైదరాబాదులోనే ఉందట,వైద్యుల  పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కూడా తీసుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుందట సమంత. అయితే గత కొన్ని నెల లో లేదా రెండవ మూడవ వారంలో ఖుషి సినిమా షూటింగ్ కు హాజరవుతానని సమంత చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పింది .కానీ ఇప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరికొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించినట్లుగా తెలిపింది. అయితే వైద్యుల సలహా మేరకు మరో నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాతలకు ఇతర యూనిట్ సభ్యులకు చెప్పింది .

అయితే ఆమె ముందు చెప్పినట్లు తాను ఈ నెలలో షూటింగ్ కు రాలేక పోతున్నానని వచ్చే నెలలో షూటింగు తప్పకుండా వస్తాను అని విజయ్ దేవరకొండ కి మరియు చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పిందట. సమంత మరియు విజయ్ దేవరకొండ నటిస్తున్న  ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యుల వద్ద సమయం అడిగిన సమంత ఇతర సినిమాల్లో కూడా నటించడం లేదు. ఆమె సైన్ చేసిన ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం ఈమె నటించడం లేదు .ఇక ఈ మధ్య విడుదలైన యశోద సినిమా ప్రమోషన్ కోసం రెండు రోజుల సమయం కేటాయించిన ఈమె దాని అనంతరం మళ్లీ మీడియం ముందుకు రాలేదు. దీంతో వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా రావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: