నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగు పెట్టిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు .విక్రమ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున చాలా తక్కువ సమయం లోనే మన్మధుడిగా, హీరోగా, కింగ్ నాగార్జున గా  పాపులారిటీని దక్కించుకున్నాడు.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున .ఇక అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటన లలో  కూడా నటిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు నాగార్జున.ఇక దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మి నీ 

అక్కినేని నాగేశ్వరరావు నాగార్జునకి ఇచ్చి వివాహం చేశారు. దాని అనంతరం నాగర్జున రెండు కుటుంబాల పరపతిని ఎప్పుడూ  కూడా ఉపయోగించుకోకుండా సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించి ప్రస్తుతం టాప్ హీరోగా ఎదిగాడు. ఇక నాగార్జున రెండవ భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మొదటి భార్య నాగచైతన్య తల్ల...చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొదటి భార్యకి నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడు అని రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని అభిప్రాయపడుతూ ఉంటారు...

అయితే మొదటి భార్య చిన్నప్పటినుండి అమెరికాలో పెరగడంతో పాటు అక్కడే చదువుకుంది. రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావు తో మంచి అనుబంధం ఏర్పడడంతో ఈ  నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ క్రమంలోనే తన కూతురు లక్ష్మిని నాగార్జునకి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న లక్ష్మీని పిలిపించి చెన్నైలో ఇద్దరికి వివాహం జరిపించడం జరిగింది. అలా ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత నాగచైతన్య జన్మించాడు. పెళ్లి తర్వాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళ్లిపోయిందని అక్కడే స్థిరపడదామని నాగార్జునతో చెప్పిందట. ఆయన సినిమాలలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదని దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు తీసుకున్నారని ఇక అదే సమయంలో తనతో నటిస్తున్న అమలతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: