వరుస విజయాలతో అడవి శేష్ తన రెమ్యూనిరేషన్ పెంచేశాడా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న యువ హీరో లలో అడివి శేషు ఒకరు. అడవి శేషు తన కెరీర్ ప్రారంభం లో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా , మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే అడవి శేషు కు తన కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమా లలో కొన్ని సినిమాల ద్వారా మాత్రమే మంచి గుర్తింపు లభించింది. అలాంటి సమయం లోనే అడవి శేషు "క్షణం" మూవీ లో సోలో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఆ తర్వాత నుండి ఈ హీరో నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

క్షణం మూవీ తర్వాత అడివి శేషు వరుసగా గూడచారి , ఎవరు ,  మేజర్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ లు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం అడవి శేషు వరుసగా మేజర్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో విజయాలను అందుకున్నాడు. ఇలా వరుసగా ఈ హీరో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో ఈ హీరో దగ్గరికి ప్రొడ్యూసర్ లు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రొడ్యూసర్ లు ఈ హీరో దగ్గరికి క్యూ కడుతూ ఉండడంతో ఈ హీరో తన రెమ్యూనరేషన్ ను  పెంచినట్లు తెలుస్తోంది. అడవి శేషు ఇకపై ఒప్పుకునే ప్రతి సినిమాకు 8 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: