"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" సినిమా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌరవం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన అల్లు శిరీష్ ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించాడు. అందులో పరుశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు మూవీ తో అల్లు శిరీష్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ,  రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 9 వ తేదీ నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని ఈరోజు నుండి ఆహా "ఓ టి టి" లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: