అటు విహారయాత్ర... ఇటు వీరయ్య యాత్ర... వైరల్ అవుతున్న చిరంజీవి పోస్ట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా , మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
 

ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ తో ఉన్న ఫోటో ను మరియు వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తో ఉన్నా ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ... ఫ్యామిలీ తో అటు విహారయాత్ర  ... హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర అంటూ క్యాప్షన్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: