"ఎన్ బి కె 108" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్... ఏకంగా అన్ని రోజులపాటు ఒకే యాక్షన్ సీన్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం , క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక జనవరి 12 వ తేదీన విడుదల చేనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత బాలకృష్ణ  , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ లో ప్రియమణి మరియు ప్రియాంక జావల్కర్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ లుగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 8 వ తేదీ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 12 రోజుల నుండి 15 రోజుల వరకు ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: