ఈ ఏడాది ఎప్పటికి మర్చిపోలేను : మృనాల్ ఠాకూర్
అందం, అభినయం, అమాయకత్వం కలగలిసిన ఈ బ్యూటీని 'సీతారామం' చిత్రంలో సీతగా కురచ దుస్తుల్లో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేనట్లుగా కనిపిస్తోందట . అందుకు కారణం ఈ మధ్యకాలంలో ఆమె హాట్హాట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలే. ఆ ఫొటోలను వీక్షించిన నెటిజన్లు... 'నిన్ను సీతగానే చూడాలనుకుంటున్నాం అని
ఇలా స్కిన్ షో చేయడం అభిమానులుగా మాకు నచ్చడం లేదు' అంటూ కామెంట్లు కూడా చేశారు. విపరీతంగా ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే దీనిపై మృణాల్ ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఆమె మరో విషయంపై అసహనం కూడా వ్యక్తం చేశారు.
జెర్సీ, సీతారామం సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్పాత్రకు ప్రాణం పోసింది మృణాళ్ ఠాకూర్. మరికొన్ని రోజుల్లో 2022 ముగియనుందని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తనకెంత ప్రత్యేకమైనదో కూడా చెప్పుకొచ్చింది.
నాకు 2022 (2022 year) అద్భుతమైన సంవత్సరం. ఈ ఏడాది నాకు ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైనది. వచ్చే ఏడాదికి కొన్ని అద్భుతమైన సినిమాలున్నాయి. ప్రస్తుతం నేను ‘పిప్పా’ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.పిప్పాతో అసోసియేట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు సంతృప్తికరమైన సంవత్సరం. నాకు అభిమానుల నుంచి లభిస్తున్న ప్రేమ అనుభూతిని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది.. భిన్నమైన సినిమాలు చేయడం వల్లే ఓ యాక్టర్గా నేను ఇంతగా ఎదిగానని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ పూజ మేరీ జాన్, ఆంఖ్ మిచోలి, గుమ్రా చిత్రాల్లో నటిస్తోంది. సీతారామం సినిమాతో ఫుల్ జోష్ మీదున్న మృణాళ్ ఠాకూర్ మరో హిట్టు కొట్టేందుకు ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తోందని తెలుస్తుంది.