రామ్ చరణ్... బుచ్చిబాబు మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అంజలి , సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రామ్ చరణ్ ,  బుచ్చిబాబు కాంబినేషన్ లో తేరకేక్కబోయే సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ వ్రైటింగ్స్ సంస్థ ఈ మూవీ ని సమర్పించబోతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో హీరో గా నటించడం ఉప్పెన మూవీ తర్వాత బుచ్చిబాబు ఈ మూవీ కి దర్శకత్వం వహించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: