ఆన్ స్టాపబుల్ సీజన్ 2 తర్వాత ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకు బాలకృష్ణ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 1 కు కూడా హోస్ట్ గా వ్యవహరించాడు. అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ హిట్ కావడంతో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు అన్ స్టాపబుల్ సీజన్ 2 ను తాజాగా ప్రారంభించారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించి ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు కూడా విడుదల అయ్యాయి. ఇందులో మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రెండవ ఎపిసోడ్ కు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ లు విచ్చేశారు.

తాజాగా ఈ టాక్ షో 3 వ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.  ఈ మూడవ ఎపిసోడ్ కు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు  అడవి శేషు లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని 3 వ  ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 14 వ తేదీన అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన 4 వ ఎపిసోడ్ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో 4 వ ఎపిసోడ్ కు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: