ఆ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీనాక్షి చౌదరి "ఇచట వాహనములు నిలపరాదు" అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఇచట వాహనములు నిలపరాదు మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ఈ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందించలేదు. కాకపోతే ఈ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ తన నటన తో , అంతకుమించిన అంద చందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అడవి శేషు హీరోగా నటించగా , శైలేష్ కోలన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో , ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మీనాక్షి చౌదరికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ,  అద్భుతమైన సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: