హీరో విక్రమ్ కు గోల్డెన్ వీసా రావడానికి.. పూర్ణ కు సంబంధమేంటి..!!

Divya
దుబాయ్ ప్రభుత్వం పలువురు భారతీయ నటీనటులకు గోల్డెన్ వీసాను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన చియాన్ విక్రమ్ దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని హీరోయిన్ పూర్ణ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తన భర్తతో కలిసి విక్రమ్ కు దుబాయ్ గోల్డెన్ వీసాను అందించిన ఒక ఫోటోని ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది. అయితే పూర్ణ తన భర్త షానిద్ అనిఫ్ చేతుల మీదుగా విక్రమ్ ఈ గోల్డెన్ విసా ను అందుకున్నారు అందుకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇటీవల వివాహం చేసుకొని దుబాయ్ కి వెళ్ళిపోయిన పూర్ణ ప్రభుత్వ వీసాలతో సంబంధం ఏంటి అన్నట్లుగా నేటిజన్లో ఆరా తీస్తున్నారు.షానిద్ అనిఫ్ చెందిన కంపెనీ ద్వారానే ఇప్పుడు విక్రమ్ కు గోల్డెన్ వీసా వచ్చిందని వార్త వైరల్ గా మారుతోంది. కాగా విద్య, సాహిత్యం, సినిమా కల్చర్ వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది. ఈ వీసా ఉన్నవారు భారతదేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవచ్చు.అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనుమతిస్తూ ఉంటారట.
2019లో యూఏఈ ప్రభుత్వం యూఏఈ గోల్డెన్ వీసాలన మంజూరు చేస్తూ ఉండగా ఇప్పటివరకు కమలహాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, త్రిష, కాజల్, ఉపాసన ,సుకుమార్, షారుక్ ఖాన్ తదితర ప్రముఖులకు అందజేశారు. ఏడాది హీరో విక్రమ్ కు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే వైవిధ్యమైన చిత్రాలను విలక్షణమైన పాత్రలు అలరిస్తూ ఉంటాడు విక్రమ్ సినిమా కోసం ఏదైనా చేయడానికి అయినా సరే సిద్ధంగా ఉంటారు అందుచేతనే టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్రమ్ కు ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాలు నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: