ఖుషి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను తెలియజేసిన విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితమే లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా ,  మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు కలిసి పూరి కనక్ట్స్ ,  ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లపై తెరకెక్కించారు.

మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు భారీ మొత్తం లో నష్టాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లై తో ప్రేక్షకులను నిరాశపరిచిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత ,  విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఖుషి మూవీ యూనిట్ ఈ సినిమాను 2022 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ "ఖుషి" మూవీ విడుదల గురించి స్పందిస్తూ ... కొన్ని కారణాల వల్ల ఖుషి మూవీ ని డిసెంబర్ నెలలో రిలీజ్ లేకపోతున్నట్లు తెలియజేశాడు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఖుషి మూవీ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: