డైనమిక్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్...!!

murali krishna
మంచు హీరో విష్ణు మోసగాళ్లు సినిమా తో గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మరి దారుణమైన పరాజయం పాలైంది. దాదాపుగా రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ నమోదు చేయలేక పోయింది అంటూ విమర్శలు ఎదుర్కొంది. మంచు విష్ణు మోసగాళ్లు సినిమా తో ఇండస్ట్రీకి దూరం అయితే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడి తరహా లో మంచు విష్ణు తాజాగా జిన్నా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సన్నీ లియోన్ కీలక పాత్ర లో నటించిన కూడా జిన్నా సినిమా ను జనాలు పట్టించుకోక పోవడం ఆశ్చర్యంగా ఉంది. మంచి కథ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా అంటూ రివ్యూ లు వచ్చాయి. అయినా కూడా సినిమా కు కలెక్షన్స్ రాక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మంచు విష్ణు సినిమా లు అంటే ఒక వర్గం ప్రేక్షకులు మరి దారుణం గా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ కారణం గానే సినిమా ను చూసేందుకు సాధారణ జనాలు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదేమో అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరేం చేసినా కూడా మంచు విష్ణు నటించిన మాత్రం ఆపేది లేదు అన్నట్లుగా తన తదుపరి సినిమా కు సంబంధించిన కథ ను వింటున్నట్లుగా తెలుస్తోంది. దేనికైనా రెడీ తరహా కామెడీ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ కోసం మంచు విష్ణు కథలు వింటున్నాడనితెలుస్తోంది. స్వతహాగా మంచి కథకుడు ఆయన మంచు విష్ణు తాను కూడా కొన్ని స్టోరీ లైన్స్ ని రాసుకుంటున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. వచ్చే సంవత్సరం ఆరంభం లో సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మంచు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈసారైనా మంచు విష్ణు కి సక్సెస్ దక్కేనా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: