యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం అది లేకుండానే షోలోకి....!!

murali krishna
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది భామలు సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో యాంకర్ శ్రీముఖి ఒకరన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన శైలి హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లతో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవలి కాలంలో ఆమె హాట్ డ్రెస్‌లతో అందాలను ఆరబోస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందో మీరే చూడండి.తెలుగు పిల్ల శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించి ఫేమస్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ చేసింది. అయితే, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో గ్యాప్ తీసుకుంది. అయినా ఫుల్ పాపులర్ అయింది.'అదుర్స్' అనే షోతో శ్రీముఖి యాంకర్‌గా పరిచయమైంది. తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసి అలరించింది. ఇలా సుదీర్ఘ కాలంగా టీవీ షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. తద్వారా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై హవా కనిపిస్తోంది.యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లతో హడావిడి చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె షోల మీద షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇలా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. దీంతో శ్రీముఖి మార్కు భారీ స్థాయిలోనే కనిపిస్తోంది.వరుసగా షోల మీద షోలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోన్న యాంకర్ శ్రీముఖి.. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా చేస్తున్నారు. దీన్ని ఓంకార్ నడిపిస్తున్నాడు. అలాగే, శ్రీముఖితో పాటు యశ్ మాస్టర్, మోనల్ గజ్జర్ ఇంకో రెండు టీమ్‌లకు లీడర్లుగా చేస్తున్నారు.ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' షోకు అదిరిపోయే స్పందన వస్తోంది. అలాగే, ఇందులో శ్రీముఖి తనదైన శైలిలో అలరిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాట్లాడుతూ.. డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. అన్నింటికీ మించి ఈ షో కోసం శ్రీముఖి అందాలను ఆరబోస్తోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.'డ్యాన్స్ ఐకాన్' షోలో 13, 14 ఎపిసోడ్‌లకు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఓ పాటకు జడ్జ్‌లు రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్‌తో కలిసి టీమ్ లీడర్లు యశ్ మాస్టర్, శ్రీముఖి డ్యాన్స్ చేశారు. అది అయిపోయిన వెంటనే శేఖర్ 'శ్రీ.. నువ్వు ఏమైనా మర్చిపోయావా? వాచ్ కానీ, ఫోన్ కానీ ఏమైనా మర్చిపోయావా?' అంటూ అనడంతో ఆమె సిగ్గు పడింది.ఆ తర్వాత రమ్యకృష్ణ కూడా తెగ నవ్వుకుంటూ.. 'కింద ప్యాంట్ ఏది? నేను చెప్పలేదు.. శేఖర్ మాస్టర్ చెప్పారు ప్యాంటు మర్చిపోయింది అని' శ్రీముఖి పరువు తీసేశారు. ఆ తర్వాత యశ్ జడ్జ్ సీటులోనే ఉన్న మోనాల్‌తో 'మోనాల్.. నీ పక్క సీటులో ప్యాంట్ ఉంది తీసుకురా' అని అన్నాడు. అందరూ ఆమె ప్యాంటును హైలైట్ చేయడంతో శ్రీముఖికి చేదు అనుభవం ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: