అప్పుడే సమంత తో ప్రేమలో పడిపోయాను... విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ సంవత్సరం లైగర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లైగర్ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గ నటించగా ,  పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైక్ టైసన్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ,  రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. దానితో లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ,  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను తాజాగా విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా సమంత పై ఉన్న అభిమానాన్ని విజయ్ దేవరకొండ చాటుకున్నాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే సమంత ను తొలిసారిగా బిగ్ స్క్రీన్ పై చూసి అభిమానిగా మారిపోయాను. ఆ సమయంలోనే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ కూడా సమంత ను ఆరాధిస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు. సమంత మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు సంతోషిస్తున్నాను అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: