RC 15.. ఒక్క సాంగ్ కోసం అన్ని కోట్లా..?

shami
ఆర్.ఆర్.ఆర్ తర్వాత సౌత్ క్రేజీ డైరక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ట్రిపుల్ ఆర్ తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ శంకర్ సినిమాతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఆర్సీ 15 సినిమా దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో కియరా హాట్ లుక్స్ తో కనిపిస్తుందని టాక్. ఆల్రెడీ వినయ విధేయ రామ సినిమాలో చరణ్, కియరా అద్వాని కలిసి నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే మళ్లీ వీరి జోడీ కలిసి సినిమా చేస్తున్నారు.
ఇక శంకర్ సినిమా అంటేనే బడ్జెట్ మోతమోగిపోతుంది. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ లో సగం అయిపోగా ఇంకా షూట్ చేయాల్సీంది చాలా ఉందట. అయినా కూడా ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం 8 కోట్లు ఖర్చు చేస్తున్నాడట శంకర్. దిల్ రాజు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. అయితే ఆయన్ని కూడా ఒప్పించి సినిమాలోని ఒక సాంగ్ కోసం 8 కోట్లు పెట్టిస్తున్నాడట. దిల్ రాజు ఆ 8 కోట్లతో తన టాలెంట్ తో 2, 3 సినిమాలు చేస్తాడు. అయితే చరణ్ సినిమాలో ఒక్క సాంగ్ కోసం అంత భాఈ ఖర్చు పెట్టేస్తున్నాడు. దిల్ రాజు పెడుతున్నాడు అంటే ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
శంకర్ సినిమా విషయంలో దిల్ రాజు కూడా బడ్జెట్ లిమిట్స్ పెద్దగా పెట్టట్లేదని అంటున్నారు. సినిమాలో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది హైలెట్ అవుతుందని అంటున్నారు. ఆర్సీ 15 ముందు 2023 సంక్రాంతి రిలీజ్ అనుకోగా ఇప్పుడు సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నేషనల్ వైడ్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ ఆచార్యతో ఫ్లాప్ అందుకోగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్ కొడతాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: