బిగ్ బాస్: శ్రీ సత్య గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

Divya
తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య. తొందరపడకు సుందర వదన వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీ సత్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీ సత్య కు ఇన్ స్టాగ్రామ్ వేదికగా 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ముక్కు సూటితనం, ఆత్మాభిమానంతో కలిసిన మొండితనం ఆమె ఐడెంటిటీ.. విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీ సత్య.. సిద్ధార్థ కాలేజ్ నుంచి బిబిఎం పూర్తి చేశాక.. విజయవాడ అందాల పోటీలో పాల్గొని గెలుపు కిరీటం సొంతం చేసుకుంది.

2016లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ పోటీకి ఎంపికై అందులో ఫొటోజెనిక్ ఫేస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మోడల్ గా,  నటిగా తన కెరియర్ దిద్దుకోవాలని హైదరాబాద్ కు చేరుకుంది శ్రీ సత్య.. స్కూల్లో చదువుకునే సమయంలోనే సరదాగా రాంప్ వాక్ లో పాల్గొన్న దగ్గర నుంచి ఆమెలో మోడలింగ్ పై ఆసక్తి కలిగింది. అలా ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. జోయాలుకాస్  , కృష్ణా జ్యువెలరీస్ కి మోడల్ గా ఫోటో షూట్ లు కూడా చేసింది. 2018లో నిన్నే పెళ్లాడతా సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టిన శ్రీ సత్య ఆ తర్వాత అత్తారింట్లో అక్క చెల్లెలు,  త్రినయిని వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత లవ్ స్కెచ్,  తరుణం వంటి షార్ట్ ఫిలిమ్స్ తో పాటు అంతా భ్రాంతియేనా, తొందరపడకు సుందర వదన వంటి వెబ్ సిరీస్ లలో కూడా శ్రీ సత్య నటించింది.
ఇక రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాలో కూడా నటించింది. గోదారి నవ్వింది సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఖాళీ సమయంలో ప్రయాణాలు చేయడం, సాహాస క్రీడలు,  బైక్ రైడింగ్ ఆమెకు చాలా ఇష్టం. ఈమె ఇష్టాలే యువతను ఆకట్టుకున్నాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: