నయనతార విఘ్నేష్ ల మధ్య గొడవలు నిజమేనా..!!
హీరోయిన్స్ లో సుమారు 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది నయనతార అనే చెప్పాలి. ఈ అమ్మడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపిన తర్వాత , చివరికి విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుంది. జూన్ 9న, తిరుమల శ్రీవారి సన్నిధిలో నయన తార.. తన ప్రియుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్నారు. ఇక అక్టోబర్ 9న తమకు కవల పిల్లలు జన్మించారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు నయన్ దంపతులు
సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో ఈ విషయం బాగా వివాదంగా మారింది. నయన్ తీరుపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా విపరీతంగా మండిపడ్డారు. ఈ వివాదం పై విచారణ చెప్పట్టింది తమిళనాడు ప్రభుత్వం. పెళ్లైన నాలుగు నెలలకె పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే నయన్ దంపతులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నయన్ విఘ్నేష్ తాము ఎప్పుడో పెళ్లి చేసుకున్నామని డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. దాంతో ఈ వివాదం సద్దుమణిగినట్టు సమాచారం. అయితే ఇప్పుడు మరో కొత్త వివాదం నయనతార విషయంలో తలెత్తినట్టు టాక్.
విఘ్నేష్ శివన్ తల్లి సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు మా వంశానికి చెందిన వారు కాదని అన్నారట. దీంతో నయనతారకి కోపం వచ్చి గతంలో విగ్నేశ్ పేరిట రాసిన ఆస్తులకి సంబంధించిన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసిందట. అంతేకాదు విగ్నేశ్ కి ఇప్పుడు దూరంగా వేరేగా ఉంటుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. వీరిద్దరి పెళ్లి సమయంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్పందించగా, నయన తారకు పెళ్లి అచ్చిరాదని అన్నారు. నయన తార జాతకంలో గురువు నీచంలో ఉన్నారని అందుకనే ఆమె వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదని ఆయన తెలిపారు. .