అల్లు అరవింద్ నిర్మాతగా రిషబ్ శెట్టితో రామ్ చరణ్ మూవీ?

Purushottham Vinay
కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన "కాంతార" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి అతనే హీరో ఇంకా అతనే దర్శకుడు.ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే భూతకోల నృత్యకారులని తెరపై చూపించిన తీరు భూతకోల వేషధారణలో రిషబ్ షెట్టి ప్రదర్శించిన నటన పలికించిన హావభావాలు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లోని చివరి 15 నిమిషాల్లో తనదైన నటనతో రిషబ్ శెట్టి అబ్బుర పరిచిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా భావోద్వేగాలకు కనెక్ట్ అవుతూ ఊహించని విధంగా ఈ మూవీపై కాసుల వర్షం కురిపిస్తున్నారు.సెప్టెంబర్ లో కన్నడలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని తెలుగులో గత శనివారం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే గీతా చూసుకుంది.


మిగతా మొత్తం హోంబలే ఫిలింస్ వారే చూసుకోవడంతో అ్లు అరవింద్ కు ఈ మూవీ వల్ల భారీ లాభాలు వచ్చే అవకాశం మిస్సయింది. ఇక ఇదిలా వుంటే తెలుగులోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్న వేళ ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ని ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయమని అల్లు అరవింద్ హీరో రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది రిషబ్ శెట్టి హీరోగా మాత్రం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రైటర్ గా మాత్రమే రిషబ్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. రిషబ్ శెట్టి రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సరిపోయే టెర్రిఫిక్ స్టోరీని వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చరణ్ కు స్టోరీని వినిపించబోతున్నారని ఇక రామ్ చరణ్ ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగతా పనులు చకచక మొదలవుతాయని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: