ప్రభాస్... మారుతి కాంబినేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యేది అప్పటినుండే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తేరకేక్కిన బాహుబలి సిరీస్ మూవీ లతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో ,  అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ముగించుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే  మూవీ షూటింగ్ లో పాల్గొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో మారుతీ దర్శకత్వంలో తేరకెక్కబోయే మూవీ లో కూడా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పై మారుతి ఫోటో షూట్ జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోటో షూట్ కూడా పూర్తి అయినట్లు సమాచారం.

అక్టోబర్ 19 వ తేదీ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పక్కా కమర్షియల్ మూవీ గా రూపొంద బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ని మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒక సెట్ లోనే జరగబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ,  మాళవిక మోహన్ హీరోయిన్ లుగా నటించనున్నట్లు ,  సంజయ్ దత్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: