కార్తికేయ-3 ఈసారి ఆ రహస్యంతో రాబోతోందా..?

Divya
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ -2 చిత్రం అనుకోని విధంగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ద్వాపర యుగం నాటి ఒక రహస్యానికి చెందిన కథ అంశంతో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వర నటించింది. బాలీవుడ్ హీరో అనుపమ ఖేర్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ కూడా అంత శ్రీకృష్ణుడి ద్వారక మధుర గోవర్ధనగిరి వంటి క్షేత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చిత్రం విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా హీరో నిఖిల్ కెరియర్ లోని ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ కి రంగం సిద్ధమవుతోంది అంటే చివర్లో సీక్వెల్ కూడా ఉండేలా ఒక హెల్త్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీంతో అందరి దృష్టి కార్తికేయ -3 సినిమా పైన పడింది. ఈ సినిమా సీక్వెల్ గురించి నిఖిల్ మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్లిన అందరూ ఈ సినిమా గురించి అడుగుతున్నారని తాను సీక్వెల్ చేసే వరకు తనని వదిలేలా లేరని చెప్పుకొచ్చారు.

అయితే కార్తికేయ -3 ఏ అంశం పైన ముందుకు వెళ్తుంది అనే విషయంపై అందరిలోనూ ఆసక్తిగా మారింది ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలు వార్తలు వినిపిస్తున్నాయి.. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం నేపథ్యంలో రాగ కార్తికేయ-2 ద్వారక నేపథ్యంలో తెరకెక్కించగా కార్తికేయ-3 కథ కూడా అంతా అయోధ్యని నేపథ్యంలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈసారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: