ప్రస్తుతం తమిళనాట "పొన్నియిన్ సెల్వన్" మూవీ హవా బాగా నడుస్తుంది.తమిళ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమానే హాట్ టాపిక్. గత కొన్ని సంవత్సరాలుగా కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మణిరత్నంకు 'పొన్నియన్ సెల్వన్' సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తోంది.కోలీవుడ్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మణిరత్నం ఈ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో మణిరత్నం టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్ళను సాధిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.తమిళనాడులో 'విక్రమ్' సినిమాను దాటేసి 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచింది.
విక్రమ్ సినిమా తమిళనాడులో రూ.175 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా పొన్నియిన్ సెల్వన్ ఇప్పటివరకు రూ.190 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళ వెర్షన్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పొన్నియిన్ సెల్వన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోష్ కొనసాగితే రోబో 2.0 షేర్ను కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించగా.. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్రాజు రిలీజ్ చేశారు.తమిళ బాహుబలిగా చెప్పుకుంటున్న ఈ సినిమా లాంగ్ రన్ లో బాహుబలిని దాటుతుందేమో చూడాలి. ఓపెనింగ్స్ తక్కువగానే వచ్చినా ఈ సినిమా మెల్ల మెల్లగా స్పీడ్ పెంచుకుంటుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 450 కోట్లు దాటేసిన ఈ సినిమా 500 కోట్ల వైపు దూసుకెలుతుంది.