ప్రభాస్.. మారుతి మూవీలో అంత మంది హీరోయిన్ లు ఉండబోతున్నారా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో నటించబోతున్న మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలు కూడా అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 17 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి షెడ్యూల్ కోసం ప్రభాస్ కేవలం వారం రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

మారుతి ఈ మూవీ ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ కథా రీత్యా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు ,  అందులో భాగంగా ఎప్పటికీ దర్శకుడు మారుతి  ,  నిధి అగర్వాల్ ను మరియు మాళవిక మోహన్ లను ఎంపిక చేసుకున్నట్లు ప్రభాస్ సరసన నటించబోయే మరో హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్ ను మూవీ యూనిట్ ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ,  ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒకే సెట్ లో జరగనున్నట్లు ఒక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: