పూరీ తెలివి.. ఆటో జానీ అలా షిఫ్ట్ చేశాడా!!

P.Nishanth Kumar
దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎలాంటి సినిమాలను చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయన గత సినిమా లైగర్ ప్రేక్షకులను అలరించలేకపోయిందే కానీ అంతకు ముందు ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేశాడు ఈ హీరో. ఆ విధంగా పూరీ జగన్నాధ్ ఇటీవలే నటుడిగా కూడా రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఆనందం నెలకొంది అని చెప్పాలి. మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా లో అయన ఓ కీలక పాత్ర లో నటించారు. ఆ పాత్ర కు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. పూరీ జగన్నాథ్ జర్నలిస్ట్ గోవర్ధన్‌గా కనిపించారు.
ఈ నేపథ్యంలో గతంలో చిరు తో పూరీ చేయాల్సిన సినిమా యొక్క విషయాలు ఇప్పుడు అందరు గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పూరీ ని చిరంజీవి ఈ విషయమై అడిగాడు కూడా. ఓ మంచి కథ తో వస్తానని పూరి జగన్నాధ్ చెప్పాడు. అయితే గతంలో చిరు కి చెప్పిన ఆటో జానీ సినిమా తోనే మళ్ళీ సినిమా చేస్తాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఆ సినిమా ను బాలయ్య తో పైసా వసూల్ పేరుతో తీసేశాడని చెబుతున్నారు. దాంతో మళ్ళీ ఓ కొత్త కథ తోనే అయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని చెప్పొచ్చు.
ఇకపోతే ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ ఇటు విమర్శకుల ప్రశంసలను పొందడంతో పాటు ప్రేక్షకులను అలరించింది. నయనతార, సత్యదేవ్ లకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిది అని చెప్పడానికి నిదర్శనం కలెక్షన్స్ అని చెప్పాలి.  విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు 150 కోట్ల వసూళ్లను అందుకునే విధంగా రంగం సిద్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: