అక్కడేం లేదు.. కానీ కీర్తిసురేప్పై ట్రోలింగ్....!!

murali krishna
యంగ్‌టైగర్ ఎన్టీఆర్  కొరటాల శివ   కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన  చిత్ర అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే.వారు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. అదే తరహాలో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఈ వాయిదాల పర్వంతో.. అసలీ సినిమా ఉంటుందా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. 'యువసుధ ఆర్ట్స్' పేరుతో ‌లో రెండు మూడు ఫేక్ అకౌంట్స్ రన్ అవుతున్నాయి. అందులో పోస్ట్ అయ్యే విషయాలను.. నిజంగానే అప్‌డేట్స్ అనుకుని ఎన్టీఆర్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. మరో రెండో రోజుల్లో  బ్లాస్టింగ్ అప్‌డేట్ రాబోతోందంటూ..ఈ ఫేక్ అకౌంట్స్‌లో వచ్చిన వార్తని ఫ్యాన్స్ నిజమనుకుని వైరల్ చేశారు. కానీ.. ఒరిజినల్‌గా అసలక్కడ ఎటువంటి కదలికా లేదు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా వచ్చిన ఆఫర్‌ని కీర్తిసురేష్ రిజిక్ట్ చేసిందంటూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్  కొందరూ ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ ట్రోల్స్‌తో ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  ఏదో అంటారు కదా.. 'ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు..' అనే సామెతలాగా.. అసలక్కడ ఏం లేనే లేదు.. ఈ ప్రాజెక్ట్‌ని కీర్తి సురేష్ రిజిక్ట్ చేసిందంటూ.. ఆమెపై ట్రోలింగ్ చేయడం ఏమిటో.. చేసేవారికే తెలియాలి. వాస్తవానికి ఈ సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్‌గా ఆలియా భట్‌ ని అనుకున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ సినిమా నుండి వైదొలగినట్లుగా చెప్పారు. ఆ తర్వాత ఇద్దరుముగ్గురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ కాదు సౌత్ హీరోయిన్నే అంటూ కీర్తి సురేష్ పేరు వినిపించింది. రీసెంట్‌గా రష్మిక మందన్న  ఫైనల్ అయినట్లుగా వార్తలు రావడం.. ఆ విషయాన్ని రష్మికను అడిగితే.. ఊ అందో.. ఊహు అందో తెలియకుండా ఆమె సమాధానం చెప్పడం వంటివి వీడియోల రూపంలో వైరల్ అయ్యాయి. నిజంగా కీర్తి రిజిక్ట్ చేసిందో.. లేదో, అసలామె వరకు ఈ ఆఫర్ వెళ్లిందో లేదో.. తెలుసుకోకుండా.. ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ముందసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందో మేకర్స్ క్లారిటీ ఇస్తే.. అప్పుడు హీరోయిన్ల గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ విషయంలో జరుగుతున్న రచ్చ చూసిన కొందరు నెటిజన్లు.. పై మేకర్స్ క్లారిటీ ఇచ్చే లోపు.. ప్రెగ్నెన్సీ సమయాన్ని పూర్తి చేసుకుని మళ్లీ ఆలియా భట్టే హీరోయిన్‌గా వస్తుందేమో.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఏదిఏమైనా ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అర్జెంట్‌గా  అప్‌డేట్ కావాలి... లేదంటే వారిని సోషల్ మీడియాలో ఆపడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: