లైగర్ ఫ్లాప్ పై పూరీ వైరల్ కామెంట్స్?

Purushottham Vinay
లైగర్ ఫ్లాప్ పై పూరీ వైరల్ కామెంట్స్ ?

రిలీజ్ కి ముందు రోజు వరకు భారీ బజ్ ని దేశ వ్యాప్తంగా క్రియేట్ చేసుకున్న లైగర్ మూవీ రిలీజ్ రోజున ఫస్ట్ షోతో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని అభిమానులకు ఊహించని విధంగా పెద్ద షాకిచ్చింది.విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏకంగా మూడేళ్లు కేటాయించాడు. ప్రాణం పెట్టాడు. ఎలాగైనా ఈ మూవీతో బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ పూరి సరైన కథ కథనాలని అందించడంతో దారుణంగా విఫలం కావడంతో విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్న 'లైగర్' దారుణ ఫలితాన్ని అందించింది. అ విషయంలో పూరిదే తప్పని విజయ్ అభిమానులు మండి పడ్డారు.అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఇన్ని రోజుల తరువాత పూరి జగన్నాథ్ తొలిసారి స్పందించాడు.చిరంజీవితో కలిసి పూరి 'గాడ్ ఫాదర్'లో నటించిన విషయం తెలిసిందే. 


రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ని సొతం చేసుకున్న నేపథ్యంలో ఇన్ స్టా వేదికగా చిరంజీవితో కలిసి లైవ్ లో ముచ్చటించాడు పూరి. ఈ సందర్భంగా 'లైగర్' పై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం మూడేళ్లు శ్రమించామని మైక్ టైసన్ నేపథ్యంలో భారీ సెట్ లలో పోరాట ఘట్టాలని రూపొందించామన్నారు.అంతే కాకుండా ఈ మూవీ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని అయితే ఫలితం ఆశించిన విధంగా రాలేదని అది నా చేతుల్లో లేదని స్పష్టం చేశాడు. అయినా సరే ఈ ఎంటైర్ ప్రక్రియని తాను ఆస్వాదించానని పూరి చెప్పడం ఇప్పడు రౌడీ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేస్తోంది. మూడేళ్లు వృధా చేసి ఆ సమయాన్ని ఆస్వాదించానని పూరి చెప్పడం కోపంగా వుందని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: