ప్రభాస్, మహేష్ లకు కథ వినిపించిన 'గాడ్ ఫాదర్' డైరెక్టర్.. కానీ చివరికి..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో 2001వ సంవత్సరంలో 'హనుమాన్ జంక్షన్' సినిమాతో దర్శకుడిగా మోహన్ రాజా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం తెలిసిందే.ఇక  జగపతిబాబు, అర్జున్, వేణు వంటి అప్పటి స్టార్ హీరోలను అద్భుతంగా డీల్ చేసి సినిమా విజయం సాధించడానికి మోహన్ రాజా ఎంతగానో కష్టపడ్డారు.అంతేకాదు వినోదాత్మక చిత్రంగా అప్పట్లో ఎంతో మందిని “హనుమాన్ జంక్షన్” అలరించడం జరిగింది.అయితే  ఈ సినిమా హిట్ అయిన తర్వాత మోహన్ రాజా మకాం మొత్తం తమిళ ఇండస్ట్రీలోకి మార్చేసుకున్నారు. ఇక అక్కడే చాలా సినిమాలు చేసి దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

ఇకపోతే కొన్ని దశాబ్దాల పాటు కోలీవుడ్ రంగానికి పరిమితమైన మోహన్ రాజా ఇటీవల “గాడ్ ఫాదర్” సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడం జరిగింది. అయితే చిరంజీవితో తెరకెక్కించిన ఈ సినిమా… సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా మలయాళం లూసిఫర్ సినిమాకి రీమేక్ గా వచ్చినా గాని తెలుగు ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథలో మార్పులు చేర్పులు చేసి… చిరంజీవిని చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించారు.అయితే  గాడ్ ఫాదర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సక్సెస్ మీట్ లలో మోహన్ రాజా పాల్గొంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

 ఇక ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాలు పాటు తమిళ రంగానికి పరిమితం కావటం పై తెలుగు ఇండస్ట్రీకి దూరం అవటంపై యాంకర్ ఇంటర్వ్యూలో ప్రశ్న వేయడం జరిగింది.అయితే ఈ ప్రశ్నకు మోహన్ రాజా సమాధానం ఇస్తూ… మధ్యలో నేను కొన్ని సినిమాలు చేయాలని భావించాను....కానీ కుదరలేదు. ఇకపోతే 2010 సంవత్సరంలో ప్రభాస్ కి ఒక స్టోరీ వినిపించాను. అంతేకాదు  ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా స్టోరీ వినిపించడం జరిగింది ఆ ప్రాజెక్టులు సెట్ కాలేదు. అయితే చివర ఆఖరికి “గాడ్ ఫాదర్” సెట్ అయింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్న అని మోహన్ రాజా.. తెలియజేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: