నాగచైతన్య కృతిశెట్టి మధ్య ఏదో ఉంది అంటున్న నెటిజన్స్..!!

murali krishna
తెలుగు కుర్రకారుకి కృతిశెట్టి పరిచయం అక్కర్లేదు మరి . ఉప్పెన సినిమాలో అమ్మడు చేసిన 'బేబమ్మ' రోల్ తెలుగు యువత గుండెల్లో నాటుకుపోయింది అంటా, దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ సరసన చేరిపోయింది నటి కృతి శెట్టి.
అవును, కేవలం 16 ఏళ్ల వయసు గల కృతిశెట్టి ఇండస్ట్రీకి రావడంతోనే తన నటనతో పాటు అందంతో అందరినీ పడేసింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక దాని తరువాత నాని హీరోగా వచ్చిన శ్యాం సింగరాయ్ సినిమా కూడా విజయవంతం అవడంతో కృతిశెట్టికి బాగా ఆఫర్సస్ కలిసొచ్చింది.
 
ఆ తరువాత అక్కినేని నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా వచ్చిన బంగార్రాజు సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి విదితమే. ఇక ఈ సినిమా కూడా ఒక మాదిరిగా ఆడటంతో కృతి శెట్టికి గోల్డెన్ లెగ్ అని నామకరణం చేసేసారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ సినిమా తరువాత ఒంటరిగా వున్న నాగ చైతన్యకి కృతిశెట్టి బాగా నచ్చిందేమో… మీడియాకి కాస్త క్లోజ్ గా  ఇద్దరు కనిపించారు. అదిగో అక్కడినుండి మొదలైంది అసలు విషయం. వారి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికారు చేసాయి. ఈ తరుణంలో తాజాగా కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
 
అవును, కృతి శెట్టి విషయంలో ప్రముఖ కమెడియన్ అయినటువంటి వెన్నెల కిషోర్ కి నాగార్జున నుండి తాజాగా ఓ వార్నింగ్  కూడా వచ్చిందట. విషయం ఏమంటే ఓ మీడియా వేదికగా వెన్నెల కిషోర్ కృతి శెట్టి మీద కుళ్ళు జోకులు వేస్తుంటే కృతి శెట్టి కి అర్థం కాక, నాగార్జున వైపు చూసిందట. దాంతో నాగ్ నా కోడలిపై ఇంకోసారి జోక్స్ వేస్తే బాగుండదు అంటూ వెన్నెల కిషోర్ కి సీరియస్ వార్నింగ్  కూడా ఇచ్చారని గుసగుసలు బాగానే వినబడుతున్నాయి మరి,.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: