గోపీచంద్ మలినేని మెచ్చుకుంటున్న బాలయ్య!!

P.Nishanth Kumar
కొంతమంది దర్శకులు హీరోలకు ఎంతో దగ్గరవుతూ ఉంటారు. వారి మధ్య మైత్రి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా చాలామంది దర్శక హీరోలు కలిసి మళ్లీ మళ్లీ పని చేస్తూ ఉంటారు. దర్శకులను మెచ్చుకోవడంలో వారితో మంచి స్నేహం చేయడంలో బాలకృష్ణకు మించిన వారు లేరు అనేది ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట. ఒకసారి బాలయ్య తో సినిమా చేసి ఆయనతో కనెక్ట్ అయితే తప్పకుండా ఆయనతో వరుస సినిమాలు చూసుకుంటూ పోతారు అన్న దానికి ఉదాహరణ బోయపాటి శ్రీను అని చెప్పాలి.

వీరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా అవి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ మరొక దర్శకుడుని మెచ్చుకోవడం వారిద్దరి మధ్య మరిన్ని సినిమాలు వస్తాయి అని చెప్పడానికి నిదర్శనం అవుతుంది. అఖండ సినిమాతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ సినిమాను చేస్తున్నాడు. మాస్ మసాలా సినిమాగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా తప్పకుండా అందరిని అఖండ సినిమా స్థాయిలో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా టర్కీ లో ఈ సినిమా యొక్క షూటింగ్ జరుపుకుంటుంది.  వచ్చే ఏడానికి సంక్రాంతి కానుక గా ఈ సినిమాను విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు వేస్తూ ఉండగా ఈ సినిమాను  తెరకెక్కిస్తున్న విధానాన్ని చూసి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ఎంతగానో మెచ్చుకున్నాడట. తప్పకుండా మళ్లీ కలిసి పని చేయాలి అన్న భరోసా ఆయన ఇస్తున్నారట. నిజంగా ఇది గోపీచంద్ కి మంచి విషయం అనే చెప్పాలి. వరుస సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూపోతున్న గోపీచంద్ ఇప్పుడు ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తే అగ్ర దర్శకుల జాబితాలోకి వెళ్లడం ఖాయం కాబట్టి బాలకృష్ణ సినిమాతో ఆయన ఏ విధమైన విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అంతకుముందు ఆయన రవితేజతో కలిసి చేసిన క్రాక్ అనే సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: