మంచి సినిమా చేశావని ఆ హీరోలు అన్నారు... శర్వానంద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శర్వానంద్ గత కొంతకాలంగా వరస పరాజయలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.

ఇలా వరుస పరాజయలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. రీతు వర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' గురించి మాట్లాడుతూ ...  ఒకే ఒక జీవితం మూవీ ని కలెక్షన్ ల కోసం కాకుండా ఓ అనుభూతి కోసం చేశాను అని , అదృష్టవశాత్తు ఈ మూవీ కి నిలకడగా కలెక్షన్ లు రావడం చాలా ఆనందంగా ఉంది అని శర్వానంద్ అన్నాడు. ఈ మూవీ ని అందరికీ అర్థమయ్యేలా డైరెక్టర్ శ్రీకాంత్ చిత్రీకరించాడు అని శర్వానంద్ చెప్పు కొచ్చాడు. మంచి మూవీ చేశావని నాని ,  సాయి ధరమ్ తేజ్ ,  సిద్ధార్థ్ ,  కార్తీ అన్నారు శర్వానంద్ చెప్పు కొచ్చాడు. అలాగే అన్ని జోనర్ లతో పోల్చుకుంటే కామెడీ ని బాగా ఎంజాయ్ చేస్తాను అని శర్వానంద్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: