లైఫ్ ఆఫ్ మత్తు: అలా నష్టపోయిన మేకర్స్?

Purushottham Vinay
ఇక నిన్న శుక్రవారం విడుదలైన తెలుగు సినిమాలలో ఏ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనే సంగతి తెలిసిందే. అయితే శనివారం రోజున శింబు హీరోగా నటించిన ది లైఫ్ ఆఫ్ ముత్తు రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి.తమిళంలో గురువారం రోజున రిలీజైన వెందు తనింధతు కాదు సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ కాగా సెన్సార్ సమస్యల వల్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం తెలుస్తుంది.అయితే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినా కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి షోలు వున్నాయని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ షోలు క్యాన్సిల్ కావడంతో టికెట్లను బుకింగ్ చేసుకున్న అభిమానులు ఫీలయ్యారని తెలుస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలవుతోంది. స్రవంతి మూవీస్ బ్యానర్ కు ఈ సినిమాతో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. శింబు గత సినిమా మానాడు ఓటీటీలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ను అభిమానించే అభిమానులు సైతం ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మధ్య కాలంలో శింబు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథలపై దృష్టి పెట్టడంతో పాటు ఆ ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. శింబు ఖాతాలో వరుస సక్సెస్ లు చేరుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. వరుస విజయాల వల్ల తెలుగులో శింబు మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: