వరస ప్లాపుల కారణంగా ఆ నిర్ణయం తీసుకున్న రాశి కన్నా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను దక్కించుకోవడంలో చాలా వెనుకబడిపోయింది. రాశి ఖన్నా ,  సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజు పండగే మూవీ తో ఆఖరి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో రాశి కన్నా , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయింది. ఆ తర్వాత థాంక్యూ మూవీ లో రాశి కన్నా నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

ఇలా ఇప్పటికే వరుసగా మూడు అపజయాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకున్న రాశి కన్నా ఈ వరస అపజయాల ఎఫెక్ట్ తో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. వరుస అపజయాలు పలకరించడంతో రాశి కన్నా తన రెమ్యూనిరేషన్ ని తగ్గించుకున్నట్లు మునుపటి సినిమాలకు తీసుకున్న దాని కంటే తక్కువ రెమినరేషన్ తీసుకునే ఆలోచనలో రాశి కన్నా ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: