ఓటీటీ కి భారీ ధరకు అమ్ముడుపోయిన పొన్నియన్ సెల్వన్..!

Divya
ప్రముఖ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో త్వరలోనే విడుదలకు సిద్ధం కానున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఇక ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటించబోతున్నారు. ఇప్పటికే తమిళ్ చరిత్రలో బాగా పాపులర్ అయిన హిస్టారికల్ కల్కి నవల పొన్నియన్ సెల్వన్ చరిత్రను తీసుకురావాలని చాలామంది స్టార్ హీరోలు కూడా ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే రజినీకాంత్, కమలహాసన్ వంటి వారు కూడా ప్రయత్నం చేయగా కుదరలేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ కథను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష తో పాటు కార్తీ , ఆర్య, విక్రమ్ తదితరులు ప్రముఖ నటులుగా నటిస్తున్నారు. అయితే తమిళంలో తప్పితే ఇప్పటివరకు ఈ సినిమాకు తెలుగులో పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు.  అలాగే మిగిలి భాషల్లో కూడా అంతంత మాత్రమే హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ఇకపోతే దాదాపు రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ముందుగా ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండవ పార్ట్ బిజినెస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో నిర్మాతలు చర్చలు జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అసలైతే మొదటి భాగం కోసం ఓటీటి హక్కులను అమెజాన్ రూ. 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక మధ్యలో హాట్స్టార్ కూడా ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ఓటిటీ దాదాపు క్లోజ్ అయినట్లే మరి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: