గాడ్ ఫాదర్ ఫంక్షన్ లో ఊహించని ట్విస్ట్ లు !

Seetha Sailaja

‘గాడ్ ఫాదర్’ విడుదలకు ఇక కేవలం 25 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మెగా అభిమానులు అంతా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫంక్షన్ హైదరాబాద్ లో కాకుండా అనంతపురంలో నిర్వహించే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా ఫంక్షన్ నిర్వహించడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో చిరంజీవికి అభిమానులు బాగానే ఉన్నప్పటికీ కోస్తా ప్రాంతం అభిమానులతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో చిరంజీవికి కొద్దిగా పట్టు తక్కువ. దీనితో ఈప్రాంతం పై తన పట్టును పెంచుకోవడానికి ఈ వ్యూహాన్ని మెగా స్టార్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు బెంగుళూరు ఈప్రాంతానికి దగ్గర కాబట్టి బెంగుళూరులో ఉండే వేలాదిమంది మెగా అభిమానులు ఈ ఈవెంట్ కు రప్పించి పక్క రాష్ట్రాలలో కూడ చిరంజీవి పట్ల మ్యానియా ఎలా ఉందో తెలియచేసే వ్యూహం కూడ ఈ ఫంక్షన్ నిర్వాహణలో ఉంది అని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఈమూవీలో అతిధి పాత్రను చేసిన సల్మాన్ ఖాన్ ను ఆహ్వానించడం జరుగుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ విడుదల విషయంలో కూడ ఎవరు ఊహించని ఒక స్ట్రాటజీని ఈమూవీ నిర్మాతలు అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో చిరంజీవి సినిమాలకు మొదటి మూడు రోజులు టిక్కెట్లు దొరకడం అంటే అది ఒక క్రేజ్ గా భావించేవారు. అయితే రిలీజ్ చేసే ధియేటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా రెండవ రోజు నుండి ధియేటర్లు ఖాళీ అవుతున్నాయి. దీనితో ఈసారి ‘గాడ్ ఫాదర్’ మూవీని తెలుగు రాష్ట్రాలలో తక్కువ ధియేటర్లలో బుక్ చేసే వ్యూహం అనుసరించబోతున్నట్లు టాక్. ఇలా ‘ఆచార్య’ ఫలితం మళ్ళీ రిపీట్ కాకుండా కొత్త వ్యూహాలు ‘గాడ్ ఫాదర్’ విషయంలో అనుసరిస్తూ భారీ ఓపెనింగ్స్ పై కన్ను వేసారు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: