ఆ సినిమాని ఆపేసిన పవర్ స్టార్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళంలో రూపొంది సూపర్ హిట్ అయినా వినోదయ్య సిత్తం సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే రీమేక్‌ కి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేశాడు.టాలీవుడ్ ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఇంకా త్రివిక్రమ్ కలిసి స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ అభిమానుల అభివృద్ధికి తగ్గట్లుగా.. ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వెంటనే డేట్ లో ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. కానీ ఇప్పటికే సగం వరకు పూర్తి అయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి కాకుండా కొత్త సినిమా ప్రారంభిస్తే అభిమానులకు ఇంకా అలాగే సినిమా యూనిట్ వర్గాల వారికి తప్పుడు సమాచారం వెళ్తుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా పవన్ సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదట క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ని పూర్తి చేస్తాడట.


ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే మరో సినిమాకు సంబంధించిన షూటింగ్లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వాలని భావిస్తున్నాడు. హరిహర వీరమల్లు సినిమా ప్రారంభించి చాలా కాలమైంది. ఇప్పటికే నిర్మాత చాలా ఆర్థికంగా పెట్టుబడి పెట్టి ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయడం ద్వారా భారీ మొత్తంలో నష్టం వచ్చే అవకాశం ఉందని.. అందుకే వెంటనే హరిహర వీరమల్లు సినిమా ప్రారంభించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ రీమేక్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. ఆ రీమేక్ లో మెగా హీరో సాయి ధరంతేజ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇంకా సాయిధరమ్ తేజ్ కలిసి నటించడం వల్ల తప్పకుండా ఆ సినిమా ఒక రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కనుక కాస్త ఆలస్యంగా విడుదల చేసినా లేదా కాస్త ఆలస్యంగా మొదలు పెట్టినా కూడా ఏం పర్వాలేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మొదట హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పని మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: