ఆకాష్ పూరితో పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ..!

Pulgam Srinivas
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్య కృష్ణ ఈ మూవీ లో నటించింది. ఆగస్టు 25 వ తేదీన తెలుగు తో పాటు  హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

దానితో పూరి జగన్నాథ్ ఇప్పటికే అనౌన్స్ చేసిన జన గణ మన మూవీ కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గొరా పరాజయం చెందడం జన గణ మన మూవీ కూడా ఆగిపోవడంతో పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి తో ఒక మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఆకాష్ పూరి 'చోర్ బజార్' అనే మూవీ లో హీరో గా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: