ఆ తేదీ నుండి 'ఓటిటి' లో స్ట్రీమింగ్ కాబోతున్న 'లైగర్' మూవీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వ వహించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది.

ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. కాకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... లైగర్ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి'  సంస్థలలో ఒకటి అయిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు , ఈ నెల 30 వ తేదీ నుండి ఈ మూవీ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: