ఆగిపోయిన పూరి జగన్నాథ్ 'జన గణ మన' మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో లలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి  గీత గోవిందం మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది. ఆగస్ట్ 25 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తీవ్రమైన నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ మూవీ తో నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో జన గణ మన అనే మూవీ ని అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం జన గణ మన మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమస్య వల్ల జన గణ మన మూవీ ని ఆపివేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. విజయ్ మరియు పూరి జగన్నాథ్ తో చర్చించి నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: