అలా ఆ మూవీని తప్పించుకున్న మహేష్ బాబు... జాన్వి కపూర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పూరి కనెక్ట్స్  మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరమ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.  అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ప్రస్తుతం చాలా తక్కువ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్ లకు ఈ సినిమా చాలా పెద్ద మొత్తంలో నష్టాలను మిగిల్చే విధంగా కనిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ మొదటగా ఈ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కించాలని అనుకున్నారట. అలాగే కథను మహేష్ బాబు కు వినిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల మహేష్ బాబు ఈ సినిమాలో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే జాన్వీ కపూర్ కి కూడా ఈ మూవీ కథను వినిపించగా డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తుంది. ఇలా ఈ ఇద్దరు లైగర్ మూవీ నుండి తప్పించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: