లైగర్ పరాజయానికి పరోక్ష కారకుడుగా మారిన సుకుమార్ ?

Seetha Sailaja

పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘లైగర్’ ఘోర పరాజయాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సస్ తరువాత పూరీ జగన్నాథ్ నుండి వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈమూవీ కనీసపు అంచనాలను కూడ అందుకోలేకపోవడం చూసి షాక్ అవుతున్నారు.

‘పోకిరి’ లాంటి బ్లాక్ బష్టర్ మూవీని తీసిన పూరీజగన్నాథ్ నుండి ఇలాంటి ఫెయిల్యూర్ మూవీ ఎందుకు వచ్చిందో అతడి సన్నిహితులకు కూడ సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈసినిమా విడుదలకు ముందు ప్రమోషన్ విషయంలో హైక్ తీసుకురావడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అనుసరించాడు.

ఈమధ్య కాలంలో ఒక దర్శకుడి సినిమాను మరొక ప్రముఖ దర్శకుడు ప్రమోట్ చేయడం ఒక పద్దతిగా మారిన పరిస్థితులలో దర్శకుడు సుకుమార్ కూడ ‘లైగర్’ ప్రమోషన్ కోసం తనవంతు సహాయం చేసాడు. పూరీజగన్నాథ్ సుకుమార్ లు కలిసి ఈమూవీ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీజగన్నాథ్ చేసిన ఒక కామెంట్ విని చాలామంది ఆశ్చర్యపోయారు. ‘పుష్ప’ క్లైమాక్స్ ను చూసి దానికి ప్రభావితం అయి తాను ‘లైగర్’ మూవీ క్లయిమాక్స్ ను వ్రాసాను అంటూ పూరీ చేసిన కామెంట్స్ విన్నవారు షాక్ అయ్యారు.

వాస్తవానికి ‘పుష్ప’ క్లయిమాక్స్ వచ్చేసరికి ఆమూవీని చూస్తున్న ప్రేక్షకుడు అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ పాత్రతో పూర్తిగా కనెక్ట్ అయిపోయారు. అయితే అలాంటి ఫీల్ ‘లైగర్’ క్లయిమాక్స్ చూస్తున్నప్పుడు కనీసం విజయ్ దేవరకొండ అభిమానులకు అయిన కలిగిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు మైక్ టైసన్ లాంటి అంతర్జాతీయ బాక్సర్ ను పట్టుకు వచ్చి ఏమాత్రం పసలేని క్లైమాక్స్ ను పూరీ సుకుమార్ ‘పుష్ప’ ను చూసి ప్రభావితం అయి వ్రాశాడా అంటూ కొందరి కామెంట్స్. ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండ కెరియర్ కు ‘లైగర్’ మరో పీడకల లా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: