గుణశేఖర్ బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్..!!
ఇక ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాల నటులకు, దర్శకులు, నిర్మాతలకు తాజాగా నోటీసు జారీ చేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాకి పన్ను రాయితీ తీసుకొని టికెట్టు రేట్లు తగ్గించకుండా అలాగే అమ్మడంతో వినియోగదారుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీంతోపాటు ఈ సినిమా నిర్మాతలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతి వాదులందరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కోర్టు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యాన్ని తెలియజేసినట్లు సమాచారం.
మరొకవైపు డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి ఈ రెండు చారిత్రాత్మకంగా సినిమాలు కావడం వల్ల అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ సినిమాలకు పన్ను రాయితీ ఇచ్చింది. అయితే ఈ పన్ను రాయితీని ప్రజలకు ఇవ్వలేదు దీంతో రాయితీ పొందిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్లు తెలియజేయడం జరిగింది. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ వివరణ ఇవ్వాల్సిందిగా హీరో బాలకృష్ణకు దర్శకులకు నిర్మాతలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రేక్షకుల సైతం ఒకసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది.